ఇప్పటికే రీపోలింగ్పై ఏపీలో రగడ జరుగుతుంది. ఈసీ, వైసీపీపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. వైసీపీ నేతల విన్నపాలు వింటారు కానీ.. మా ఫిర్యాదులు తమకు పట్టవా అని ఈసీపై ఓ రేంజ్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. కాగా.. టీడీపీ ఫిర్యాదుమేరకు మరో రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని కుప్పం బాదూరు, కాలేపల్లిలోని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ రెండింటితోపాటు మొత్తం 7 కేంద్రాల్లో ఆదివారం రీపోలింగ్ నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న తెలిపారు.