దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఇన్చార్జ్గా సీటీ రవి
కర్ణాటక పర్యాటక మంత్రి సీటీ రవిని బీజేపీ దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జ్గా అధిష్టానం ఖరారు చేసింది.. ఢిల్లీలో జరిగిన కార్యవర్గ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నిర్ణయం తీసుకున్నారు.
కర్ణాటక పర్యాటక మంత్రి సీటీ రవిని బీజేపీ దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జ్గా అధిష్టానం ఖరారు చేసింది.. ఢిల్లీలో జరిగిన కార్యవర్గ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే రవిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. నడ్డా తాజా నిర్ణయంతో ప్రస్తుత కర్ణాటక బీజేపీ ఇన్చార్జ్ మురళీధర్రావు తప్పుకోనున్నారు. కర్ణాటకతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, లక్షద్వీ్పకు సీటీ రవి బీజేపీ ఇన్చార్జ్గా ఉంటారు. ఇటీవలే కర్ణాటక మంత్రి పదవికి రవి రాజీనామా చేశారు. అయితే, దీనిపై ఆరాష్ట్ర ముఖ్యమంత్రి యడీయూరప్ప తన నిర్ణయాన్ని పెండింగ్ లో ఉంచారు.