అమెజాన్ ఆదిమవాసులకూ కరోనా.. బ్రెజిల్ ఆందోళన

| Edited By: Anil kumar poka

Apr 09, 2020 | 12:54 PM

అమెజాన్ అటవీ ప్రాంతంలో.. దట్టమైన చెట్ల మాటున నివసించే ఆదివాసీల్లో కూడా ఏడు కరోనా వైరస్ కేసులు బయటపడడంతో బ్రెజిల్ ఆందోళన చెందుతోంది. 'యానోమామి' అనే తెగకు చెందిన ఈ ఆదివాసీల్లో ఏడుగురికి ఈ కేసులు కంఫామ్.......

అమెజాన్ ఆదిమవాసులకూ కరోనా.. బ్రెజిల్ ఆందోళన
Follow us on

అమెజాన్ అటవీ ప్రాంతంలో.. దట్టమైన చెట్ల మాటున నివసించే ఆదివాసీల్లో కూడా ఏడు కరోనా వైరస్ కేసులు బయటపడడంతో బ్రెజిల్ ఆందోళన చెందుతోంది. ‘యానోమామి’ అనే తెగకు చెందిన ఈ ఆదివాసీల్లో ఏడుగురికి ఈ కేసులు కంఫామ్ అయినట్టు బ్రెజిల్ ఆరోగ్య శాఖ మంత్రి లూయిజ్ హెన్రిక్ మాండెట్టా తెలిపారు. నిజానికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండని  ఈ తెగకు కరోనా సోకడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. . వీరికే ఈ మహమ్మారి సోకిందంటే మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. యానోమామి తెగకు చెందిన 15 ఏళ్ళ కుర్రాడికి ఈ వైరస్ సోకగా ఆసుపత్రిలో ఐ సీ యు లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు ఆయన చెప్పారు. మొదట వారం రోజుల క్రితం ‘కోకామా’ తెగకు చెందిన 20ఏళ్ళ మహిళకు కరోనా సోకింది. బ్రెజిల్ అటవీ ప్రాంతాల్లో 300 కి పైగా వివిధ తెగలకు చెందిన 18 లక్షల మంది నివసిస్తున్నారు. నాగరిక సమాజానికి దూరంగా ఉంటున్న ఈ తెగల్లో యానోమామికి చెందిన 27 వేల మంది ఉన్నట్టు అంచనా.

బ్రెజిల్ లో కూడా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఆ దేశంలో రోజురోజుకీ కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది. తమకు కూడాకరోనా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు కావాలని ఆ దేశ అధ్యక్షుడు బొల్సొనారో.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందుకు మోదీ సానుకూలంగా స్పందించారు.