AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనావైరస్: ప్రపంచంలో మూడోవంతు కేసులు.. నాలుగో వంతు మరణాలు.. అక్కడే..

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ విధించాయి. ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. కరోనా విజృంభణకు అమెరికాలో 60 వేల మందికి పైగా బలయ్యారు. వియత్నాంతో జరిగిన యుద్ధంలో మరణించిన 58,220 మంది సైనికుల సంఖ్య కంటే ఇది చాలా ఎక్కువ. కాగా, అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 10,48,834కి చేరింది. ప్రపంచంలో నమోదైన 31,86,458 పాజిటివ్‌ కేసుల్లో మూడోవంతు అమెరికాలోనే ఉన్నా యి. ప్రపంచ దేశాల్లో కరోనా మరణాలు 2,25,521. నాలుగో వంతు […]

కరోనావైరస్: ప్రపంచంలో మూడోవంతు కేసులు.. నాలుగో వంతు మరణాలు.. అక్కడే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 30, 2020 | 4:01 PM

Share

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ విధించాయి. ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. కరోనా విజృంభణకు అమెరికాలో 60 వేల మందికి పైగా బలయ్యారు. వియత్నాంతో జరిగిన యుద్ధంలో మరణించిన 58,220 మంది సైనికుల సంఖ్య కంటే ఇది చాలా ఎక్కువ. కాగా, అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 10,48,834కి చేరింది. ప్రపంచంలో నమోదైన 31,86,458 పాజిటివ్‌ కేసుల్లో మూడోవంతు అమెరికాలోనే ఉన్నా యి. ప్రపంచ దేశాల్లో కరోనా మరణాలు 2,25,521. నాలుగో వంతు (60,495)కు పైగా ఇక్కడే నమోదయ్యాయి.

కాగా.. కోవిద్-19 అమెరికాలోని కొన్నే ప్రాంతాల్లో అదుపులోకి వచ్చింది. ఆ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను తొలగిస్తున్నారు. కరోనాపై పోరులో కచ్చితంగా విజయం సాధిస్తామని, దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడం ఖాయమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. గడ్డుకాలం ముగిసిందని, లక్షలాది మంది దేశ ప్రజలు  త్యాగాలు చేశారన్నారు. కరోనా నేపథ్యంలో 127 దేశాల నుంచి 71,538 మంది అమెరికన్లను స్వదేశానికి రప్పించామని  విదేశాంగ శాఖ ప్రతినిధి మోర్గాన్‌ ఓర్టగస్‌ తెలిపారు.