సుప్రీంలో ఒకే బెంచ్.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విచారణ

|

Mar 23, 2020 | 10:19 AM

భారత్​లో కరోనా వైరస్​ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోయిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి కేవలం అత్యవసర పిటిషన్లను మాత్రమే విచారించాలని..అవి కూడా ఇద్దరు జడ్జులతో కూడిన ఒక్క బెంచ్ మాత్రమే వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా వాదనలు వినాలని డిసైడయ్యింది.  అడ్వకేట్స్ వేరే గదిలో వాదనలు వినిపిస్తూ ఉండగా..న్యాయమూర్తులు కోర్టులో విచారణ చేయనున్నారు. ఈ మేరకు జస్టిస్​ ఎస్​.ఏ బోబ్డే, జస్టిస్​ డీ.వై చంద్రచూడ్​లతో కూడిన ధర్మాసనం  ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి […]

సుప్రీంలో ఒకే బెంచ్.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విచారణ
Follow us on

భారత్​లో కరోనా వైరస్​ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోయిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి కేవలం అత్యవసర పిటిషన్లను మాత్రమే విచారించాలని..అవి కూడా ఇద్దరు జడ్జులతో కూడిన ఒక్క బెంచ్ మాత్రమే వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా వాదనలు వినాలని డిసైడయ్యింది.  అడ్వకేట్స్ వేరే గదిలో వాదనలు వినిపిస్తూ ఉండగా..న్యాయమూర్తులు కోర్టులో విచారణ చేయనున్నారు. ఈ మేరకు జస్టిస్​ ఎస్​.ఏ బోబ్డే, జస్టిస్​ డీ.వై చంద్రచూడ్​లతో కూడిన ధర్మాసనం  ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్​ పాటించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఈ నెల 31వ వరకు ఢిల్లీలో లాక్‌డౌన్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.