ఏపీలో కరోనా విజృంభణ.. 12 వేలు దాటిన పాజిటివ్ కేసులు..

|

Jun 27, 2020 | 2:03 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇవాళ కొత్తగా 796 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఏపీలో కరోనా విజృంభణ.. 12 వేలు దాటిన పాజిటివ్ కేసులు..
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇవాళ కొత్తగా 796 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇందులో రాష్ట్రానికి చెందిన కేసులు 740 కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందినవి 56 ఉన్నాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 12,285కి చేరింది. ఇందులో 6,648 యాక్టివ్ కేసులు ఉండగా.. 5,480 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 157కి చేరింది.

మరోవైపు గడిచిన 24 గంటల్లో కరోనాతో కర్నూలులో నలుగురు, కృష్ణలో నలుగురు, పశ్చిమ గోదావరి ఒక్కరు, తూర్పు గోదావరి ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు మరణించగా.. 263 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురం 161, చిత్తూరు 84, ఈస్ట్ గోదావరి 109, గుంటూరు 71, కడప 50, కృష్ణ 53, కర్నూలు  69, నెల్లూరు 24, ప్రకాశం 26, శ్రీకాకుళం 0, విశాఖపట్నం 34, విజయనగరం 15, వెస్ట్ గోదావరిలో 44 కేసులు నమోదయ్యాయి.