సచివాలయం తరలింపు పై కేసీఆర్ సమీక్ష

| Edited By:

Jul 02, 2019 | 9:43 AM

తెలంగాణ సచివాలయం తరలింపు పై సీఎం కేసీఆర్ నేడు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఏ శాఖ కార్యాలయాన్ని ఎక్కడికి తరలించాలి, ఎన్ని రోజుల్లో తరలించాలనే అంశంపై ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. కేసీఆర్ సమీక్ష నేపథ్యంలో సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశమైన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. తరలింపు ఏర్పాట్ల పై కసరత్తు పూర్తి చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు […]

సచివాలయం తరలింపు పై కేసీఆర్ సమీక్ష
Follow us on

తెలంగాణ సచివాలయం తరలింపు పై సీఎం కేసీఆర్ నేడు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఏ శాఖ కార్యాలయాన్ని ఎక్కడికి తరలించాలి, ఎన్ని రోజుల్లో తరలించాలనే అంశంపై ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. కేసీఆర్ సమీక్ష నేపథ్యంలో సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశమైన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. తరలింపు ఏర్పాట్ల పై కసరత్తు పూర్తి చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.