Shoaib Akhtar : పాక్ క్రికెట్ బోర్డుపై షోయబ్ అక్తర్ ఫైర్.. ‘యావరేజ్’ ఆటగాళ్లను తీసుకుంటోందని విమర్శలు

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ ఆటతీరుపై ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మండిపడ్డాడు. పాక్ జట్టులోకి ‘యావరేజ్’ ఆటగాళ్లను తీసుకుంటోందని, వారు స్కూలు స్థాయి క్రికెట్‌కే పరిమితమవుతున్నారని విమర్శించాడు.

Shoaib Akhtar : పాక్ క్రికెట్ బోర్డుపై షోయబ్ అక్తర్ ఫైర్.. ‘యావరేజ్’ ఆటగాళ్లను తీసుకుంటోందని విమర్శలు

Updated on: Jan 05, 2021 | 10:35 PM

Shoaib Akhtar : న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ ఆటతీరుపై ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మండిపడ్డాడు. పాక్ జట్టులోకి ‘యావరేజ్’ ఆటగాళ్లను తీసుకుంటోందని, వారు స్కూలు స్థాయి క్రికెట్‌కే పరిమితమవుతున్నారని విమర్శించాడు. పీసీబీ సగటు ఆటగాళ్లను తీసుకొచ్చి ఆడిస్తోందని దుమ్మెత్తి పోశాడు. జట్టు సభ్యులు  స్కూలు క్రికెట్ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సగటు ఆటగాళ్లతో ఆడిస్తే  ఇలాంటి ఫలితాలే వస్తాయని మండిపడ్డాడు. మేనేజ్‌మెంట్ వారిని స్కూలు స్థాయి క్రికెటర్లుగా తయారు చేస్తోందని విమర్శించాడు. ఇప్పుడేమో మేనేజ్‌మెంట్‌ను మార్చాలని బోర్డు ఆలోచిస్తోందని, కానీ అది జరిగేది ఎప్పుడని ప్రశ్నించాడు.


న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌ను 659/6 వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీ (238)తో అదరగొట్టగా, హెన్రీ నికోలస్ (157), డరిల్ మిచెల్ (102 నాటౌట్) సెంచరీలతో చెలరేగారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కంటే ఇంకా 354 పరుగులు వెనకబడి ఉన్న పాకిస్థాన్ ఓటమి దాదాపు ఖరారైంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాక్ ఓటమి నుంచి గట్టక్కే అవకాశం లేదు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us