Breaking: పిడుగుపాటుకు తండ్రీకూతుళ్లు ముగ్గు‌రూ మృత్యువాత

|

May 30, 2020 | 10:04 PM

చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెద్దపంజాణి మండలం తిప్పిరెడ్డి ప‌ల్లిలో పిడుగుపాటుకు గురై ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు ముగ్గు‌రూ మృత్యువాత ప‌డ్డారు. తిప్పి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. శనివారం సాయంత్రం తన ఇద్దరు కూతుళ్లతో కలిసి పొలం వద్దనున్న గేదెల‌ పాలు తీసుకురావడానికి వెళ్లాడు. ఇంతలో భారీ వర్షం కురిసి, ఒక్కసారిగా పిడుగు పడటంతో రామకృష్ణతో పాటు అతని ఇద్దరు కుమార్తెలు రమాదేవి(24), మీనా(22) లు […]

Breaking: పిడుగుపాటుకు తండ్రీకూతుళ్లు ముగ్గు‌రూ మృత్యువాత
Follow us on

చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెద్దపంజాణి మండలం తిప్పిరెడ్డి ప‌ల్లిలో పిడుగుపాటుకు గురై ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు ముగ్గు‌రూ మృత్యువాత ప‌డ్డారు. తిప్పి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. శనివారం సాయంత్రం తన ఇద్దరు కూతుళ్లతో కలిసి పొలం వద్దనున్న గేదెల‌ పాలు తీసుకురావడానికి వెళ్లాడు. ఇంతలో భారీ వర్షం కురిసి, ఒక్కసారిగా పిడుగు పడటంతో రామకృష్ణతో పాటు అతని ఇద్దరు కుమార్తెలు రమాదేవి(24), మీనా(22) లు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనను పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా రామకృష్ణ భార్య ఈ విషాద సంఘ‌ట‌న గురించి తెలుసుకున్న వెంటనే స్పృహ‌ కోల్పోయింది. దీంతో గ్రామ‌ంలో తీవ్ర విషాధచాయలు అలుముకున్నాయి. ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.