ఎస్సీ విద్యార్థులకు కేంద్రం శుభవార్త.. ఏకంగా రూ.59వేల కోట్ల విలువైన స్కాలర్ షిప్‌లు అందజేయనున్నట్లు ప్రకటన.

| Edited By: Pardhasaradhi Peri

Dec 23, 2020 | 5:11 PM

దేశంలోని ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎస్సీ విద్యార్థుల చదువుల కోసం ఏకంగా రూ.59 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది.

ఎస్సీ విద్యార్థులకు కేంద్రం శుభవార్త.. ఏకంగా రూ.59వేల కోట్ల విలువైన స్కాలర్ షిప్‌లు అందజేయనున్నట్లు ప్రకటన.
Follow us on

central govt good news to sc students: దేశంలోని ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎస్సీ విద్యార్థుల చదువుల కోసం ఏకంగా రూ.59 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌ల ద్వారా దాదాపు 4 కోట్లకు పైగా విద్యార్థులకు మేలు జరగనుంది. ఈ మొత్తాన్ని రానున్న ఐదేళ్లలో విద్యార్థుల చదువులు, సంక్షేమం కోసం ఉపయోగించనున్నారు.
కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి తవర్‌చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ఎస్సీ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.35,534 కోట్లు ఖర్చు చేయనుండగా మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.