కంగనా మాటంటే మాటే.. ముంబై ఎయిర్ పోర్టులో అడుగు పెట్టింది

|

Sep 09, 2020 | 4:41 PM

బాలీవుడ్‌ సంచలనాల క్వీన్‌ కంగనా రనౌత్‌ బుధవారం మధ్యాహ్నం భారీ భద్రత నడుమ ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టారు. ఎయిర్‌పోర్ట్‌ బయట కంగనా రాకను వ్యతిరేకిస్తూ శివసేన కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడి చేరుకోగా...

కంగనా మాటంటే మాటే.. ముంబై ఎయిర్ పోర్టులో అడుగు పెట్టింది
Follow us on

Kangana Ranaut  : బాలీవుడ్‌ సంచలనాల క్వీన్‌ కంగనా రనౌత్‌ బుధవారం మధ్యాహ్నం భారీ భద్రత నడుమ ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టారు. ఎయిర్‌పోర్ట్‌ బయట కంగనా రాకను వ్యతిరేకిస్తూ శివసేన కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడి చేరుకోగా… మరోవైపు కర్ణిసేన, ఆర్‌పీఐ కార్యకర్తలు క్వీన్‌కు మద్దతుగా భారీగా తరలివచ్చారు.దీంతో ఇరు వర్గాలు ఎయిర్‌పోర్ట్‌ వద్ద నినాదాలతో హోరెత్తిపోయింది. ఉద్రిక్తత పెరుగుతుండటంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి కంగనా ప్రత్యేక గేట్‌ ద్వారా బయటకు వెళ్లడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తన కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూలదోయడంతో ముంబైని ఆమె మరోసారి పీఓకేతో పోల్చారు.

సుశాంత్ కేసులో ముంబై పోలీసులపై తనకు నమ్మకం లేదని బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌ చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే నగరంలో ఉండరాదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన కామెంట్ చేయడంతో మాటల యుద్ధం మొదలైంద. తాను ఈనెల 9న ముంబై వస్తున్నానని దమ్ముంటే అడ్డుకోవాలని కంగనా చేసిన ప్రకటనతో ఉత్కంఠ నెలకొంది. అన్నట్లుగానే ఈ మధ్యాహ్నం ముంబైలో అడుగు పెట్టారు కంగనా రనౌత్.