విదేశాల్లో ఐపీఎల్ 2020.. అసలు సాధ్యమేనా..!

|

Jun 05, 2020 | 5:43 PM

కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2020ను నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది. వాస్తవానికి మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఈ లీగ్..

విదేశాల్లో ఐపీఎల్ 2020.. అసలు సాధ్యమేనా..!
Follow us on

కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2020ను నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది. వాస్తవానికి మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఈ లీగ్.. కరోనా కారణంగా తొలుత ఏప్రిల్ 15కు వాయిదా పడింది. అయితే దేశంలో వైరస్ తీవ్రత ఇంకా తగ్గకపోవడంతో బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్ రద్దయితే మాత్రం సుమారు రూ. 4000 కోట్లు బీసీసీఐ నష్టపోతుంది.

ఇప్పటికే ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 18 నుంచి జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేయాలని ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆ అక్టోబర్- నవంబర్ విండోలో ఐపీఎల్‌ను నిర్వహించేందుకు ఇప్పటికే బీసీసీఐ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అయితే ప్రస్తుతం రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులను చూస్తుంటే అది అసాధ్యమని చెప్పొచ్చు.

దీనితో విదేశాల్లో ఐపీఎల్ టోర్నీని నిర్వహించాలని యోచిస్తోంది. ఇప్పటికే శ్రీలంక, యుఏఈ తాము ఐపీఎల్‌ను నిర్వహించేందుకు సిద్దమని ప్రకటించగా.. ఇదే కోవలో దక్షిణాఫ్రికాకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ‘ఐపీఎల్ 2020 సీజన్ భారత్‌లో నిర్వహించేందుకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని’ తాజాగా బీసీసీఐ అధికారి ఒకరు మీడియాతో వెల్లడించారు. మరి చూడాలి పరిస్థితులు ఎలా మారతాయి అన్నది.!

ఇది చదవండి: పంతులమ్మ కోటి రూపాయల కహానీ.. అసలు సంగతేంటంటే.?