AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంక్ ఖాతాదారులకు ఝలక్.. ఆగష్టు 1 నుంచి పెనాల్టీల బాదుడు..

మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా.? తరచుగా ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు.? అయితే ఈ న్యూస్ మీకోసమే.! అకౌంట్ మినిమమ్ బ్యాలెన్స్‌తో సహా క్యాష్ ట్రాన్సాక్షన్స్‌పై ఛార్జీలు విధించేందుకు పలు బ్యాంకులు సిద్దమవుతున్నాయి.

బ్యాంక్ ఖాతాదారులకు ఝలక్.. ఆగష్టు 1 నుంచి పెనాల్టీల బాదుడు..
Ravi Kiran
|

Updated on: Jul 18, 2020 | 12:17 AM

Share

Banks to increase cash handling charges: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా.? తరచుగా ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు.? అయితే ఈ న్యూస్ మీకోసమే.! అకౌంట్ మినిమమ్ బ్యాలెన్స్‌తో సహా క్యాష్ ట్రాన్సాక్షన్స్‌పై ఛార్జీలు విధించేందుకు పలు బ్యాంకులు సిద్దమవుతున్నాయి. ఈ కొత్త నిబంధనలు ఆగష్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యాక్సిస్ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంకులు ఈ లిస్టులో ఉన్నాయి.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కస్టమర్లు ఇక నుంచి వారి అకౌంట్లలో రూ. 2000(సిటీలలో) మినిమమ్ బ్యాలెన్స్‌ ఉంచుకోవాలి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1500 మెయిన్‌టైన్‌ చేయాలి. ఒకవేళ దీని కంటే తక్కువ ఉంటే రూ. 20- 75 వరకు ఛార్జీలు విధించనున్నారు. ఇక కరెంట్ అకౌంట్ ఖాతాదారులు ప్రతీ నెలా రూ. 5000 ఉంచాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక క్యాష్ ట్రాన్సాక్షన్స్‌ విషయానికి వస్తే.. ప్రతీ నెలా మూడు విత్‌డ్రాయల్స్‌ దాటినా, డిపాజిట్ చేయలన్నా రూ. 100 పెనాల్టీ చెల్లించకతప్పదు. అలాగే లాకర్ డిపాజిట్ చార్జీలు తగ్గగా.. పెనాల్టీ చార్జీలు మరోసారి సామాన్యులకు భారం కానున్నాయి. కరోనా కారణంగా బ్యాంకింగ్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ తర్వాత నుంచి ప్రజలు ఎక్కువగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. కాగా, యాక్సిస్ బ్యాంక్ కూడా ఈసీఎస్ ట్రాన్సాక్షన్స్‌పై రూ. 25 సర్వీస్ ఛార్జీ విధించనుంది.