సరిహద్దుల్లో టెన్ష‌న్..టెన్ష‌న్…పొంచిఉన్న 300 మంది ఉగ్రవాదులు..!

జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి తీవ్ర‌ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 300 మంది ఉగ్రవాదులు పీఓకే నియంత్రణ రేఖ వెంబ‌డి కాపుగాసి ఉన్నట్లు ఇంటిలిజెన్స్ రిపోర్ట్ అందింది. అక్కడి నుంచి కశ్మీర్​ లోయలోకి ప్ర‌వేశించాల‌న్న‌ది వారి కుట్ర‌గా తెలుస్తోంది. రంజాన్​ వేళ ఇండియాలోకి చొర‌బ‌డి తీవ్ర‌ విధ్వంసం సృష్టించేందుకు ముష్క‌రులు ప్లాన్ చేసిన‌ట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. వీరంతా నిషేధిత ఉగ్ర‌వాద సంస్థ‌లు హిజ్బుల్​ ముజాహిదీన్​, లష్కరే తోయిబాకు చెందినవారేనని అనుమానిస్తున్నారు. ఈ సమాచారంతో వెంట‌నే […]

సరిహద్దుల్లో టెన్ష‌న్..టెన్ష‌న్...పొంచిఉన్న 300 మంది ఉగ్రవాదులు..!

Updated on: Apr 26, 2020 | 11:30 PM

జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి తీవ్ర‌ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 300 మంది ఉగ్రవాదులు పీఓకే నియంత్రణ రేఖ వెంబ‌డి కాపుగాసి ఉన్నట్లు ఇంటిలిజెన్స్ రిపోర్ట్ అందింది. అక్కడి నుంచి కశ్మీర్​ లోయలోకి ప్ర‌వేశించాల‌న్న‌ది వారి కుట్ర‌గా తెలుస్తోంది. రంజాన్​ వేళ ఇండియాలోకి చొర‌బ‌డి తీవ్ర‌ విధ్వంసం సృష్టించేందుకు ముష్క‌రులు ప్లాన్ చేసిన‌ట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. వీరంతా నిషేధిత ఉగ్ర‌వాద సంస్థ‌లు హిజ్బుల్​ ముజాహిదీన్​, లష్కరే తోయిబాకు చెందినవారేనని అనుమానిస్తున్నారు. ఈ సమాచారంతో వెంట‌నే అప్రమత్తమైన భార‌త సైన్యం..స‌రిహ‌ద్దుల వెంబడి సైన్యాన్ని అప్ర‌మ‌త్తం చేసింది. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితుల్ని సమీక్షిస్తోంది.

కశ్మీర్​లోని XV కార్ప్స్ ని లీడ్ చేస్తోన్న‌ లెఫ్టినెంట్​ జనరల్ బీఎస్​ రాజు.. చొరబాట్లకు అవకాశమున్న అన్ని ఏరియాస్ ని తనిఖీలు చెయ్యాల‌ని ఆదేశాలు జారీ చేశారు. తరచుగా వివిధ టీమ్స్ తో రివ్యూ మీటింగ్స్ నిర్వ‌హిస్తున్నారు. ఒకవేళ ఈ ఆపరేషన్​లో కాల్పులు జ‌రపాల్సి వ‌స్తే ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న అంశంపై కొన్ని సూచనలు చేశారు అధికారులు. ప్రత్యర్థులకు కరోనా ఉండే అవకాశాలున్న నేపథ్యంలో.. వీలైన‌న్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆర్మీకి సూచించారు.