APSRTC: ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. ఆ రూట్లలో బస్సు సర్వీసులు నిలిచిపోయినట్లే.!

APSRTC Inter State Services: ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. ఇటీవల మొదలైన ఏపీ- కర్ణాటక అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపధ్యంలో ఈ నెల 14 నుంచి వారం రోజుల పాటు బెంగళూరు సిటీలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఇటీవలే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనితో బెంగళూరు సిటీ, బెంగళూరు రూరల్ ప్రాంతాల్లో ఈ నెల 14 రాత్రి గం. 8.00 […]

APSRTC: ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. ఆ రూట్లలో బస్సు సర్వీసులు నిలిచిపోయినట్లే.!

Updated on: Jul 13, 2020 | 12:27 PM

APSRTC Inter State Services: ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. ఇటీవల మొదలైన ఏపీ- కర్ణాటక అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపధ్యంలో ఈ నెల 14 నుంచి వారం రోజుల పాటు బెంగళూరు సిటీలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఇటీవలే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనితో బెంగళూరు సిటీ, బెంగళూరు రూరల్ ప్రాంతాల్లో ఈ నెల 14 రాత్రి గం. 8.00 నుంచి జూలై 22 వరకు పూర్తిస్థాయిలో కఠినతరమైన నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

అందువల్ల ఏపీ-కర్ణాటక మధ్య బస్సు సర్వీసులు జూలై 15వ తేదీ నుంచి ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెంగళూరులో లాక్ డౌన్ విధిస్తున్న కారణంగా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ వైపు వెళ్లే బస్సు సర్వీసులను నిలిపేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఏపీ నుంచి వచ్చే బస్సుల అనుమతిపై నేడు స్పష్టత రానుంది. కాగా, ఒకవేళ బస్సు సర్వీసులు రద్దయితే ఆన్లైన్ రిజర్వేషన్ టికెట్లకు ఏపీఆర్టీసీ డబ్బులు తిరిగి ఇవ్వనుంది.

Also Read:

విద్యార్ధులకు ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఏపీ: ఆగష్టు 3 నుంచి ఇంటర్ కళాశాలల రీ-ఓపెన్.. 196 పనిదినాలు..!

ఏపీలో రెడ్ జోన్‌లోకి 97 ప్రాంతాలు.. వివరాలివే.!

Loading...
Unable to load recommendations.
Follow Us