విజయదశమి వేళ అమ్మలగన్నమ్మ బెజవాడ దుర్మమ్మ శోభాయమానంగా వెలిగిపోతోంది. అమ్మ దివ్యదర్శనం చేసుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. భారీ ఎత్తున తరలివస్తోన్న భక్తకోటితో ఇంద్రకీలాద్రి పర్వతం పనులపండుగగా మారిపోయింది. విజయదశమి రోజైన ఇవాళ అమ్మవారిని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుటుంబసమేతంగా తొలి దర్శనం చేసుకున్నారు. కమిషనర్ అర్జునరావు, ఇఓ సురేష్ బాబు.. పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు మంత్రి ఫ్యామిలీకి స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనానికి సహకరించారు.