నేటి నుంచే ఏపీలో ‘జగనన్న విద్యాకానుక’ పథకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభించనుంది. కృష్ణా జిల్లా పునాదిపాడు హైస్కూల్‌లో సీఎం జగన్‌ ఈకార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముందుగా హై స్కూల్‌లో నాడు – నేడు పనులను పరిశీలించి.. విద్యార్థులతో ముచ్చటిస్తారు ముఖ్యమంత్రి జగన్. అనంతరం స్టూడెంట్స్‌కి విద్యా కానుక కిట్లను అందజేస్తారు. ఈ కిట్టులో స్కూల్ బ్యాగ్‌తో పాటు మూడు జతల యూనిఫామ్స్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్‌ ఉంటాయి. యూనిఫామ్‌ కుట్టుకూలి […]

నేటి నుంచే ఏపీలో జగనన్న విద్యాకానుక పథకం

Updated on: Oct 08, 2020 | 7:16 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభించనుంది. కృష్ణా జిల్లా పునాదిపాడు హైస్కూల్‌లో సీఎం జగన్‌ ఈకార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముందుగా హై స్కూల్‌లో నాడు – నేడు పనులను పరిశీలించి.. విద్యార్థులతో ముచ్చటిస్తారు ముఖ్యమంత్రి జగన్. అనంతరం స్టూడెంట్స్‌కి విద్యా కానుక కిట్లను అందజేస్తారు. ఈ కిట్టులో స్కూల్ బ్యాగ్‌తో పాటు మూడు జతల యూనిఫామ్స్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్‌ ఉంటాయి. యూనిఫామ్‌ కుట్టుకూలి డబ్బులను ప్రభుత్వం విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో వేయనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us