ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. తగ్గించిన వేతనాలు చెల్లింపుకు కీలక ఉత్తర్వులు…

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్ కారణంగా మార్చి నెలలో వాయిదా వేసిన పెన్షన్లు, వేతనాలను...

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. తగ్గించిన వేతనాలు చెల్లింపుకు కీలక ఉత్తర్వులు...

Updated on: Dec 01, 2020 | 5:53 PM

Government Employees AP: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్ కారణంగా మార్చి నెలలో వాయిదా వేసిన పెన్షన్లు, వేతనాలను డిసెంబర్ నెలలో చెల్లించనున్నట్లు ప్రకటిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏప్రిల్ నెల బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ ఆదేశించారు.

కాగా, ఏప్రిల్ నెలలో తగ్గించిన వేతనాలను కూడా డిసెంబర్ నెలలో 50 శాతం.. 2021 జనవరిలో మరో 50 శాతం చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అటు ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కూడా పెంచేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అంగీకారం తెలిపినట్లు ఆర్ధిక శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉద్యోగులకు 27.248 శాతం మేర కరువు భత్యాన్ని చెల్లిస్తుండగా.. దాన్ని 3.144 శాతానికి పెంచడానికి ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్లు రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారులు తెలిపారు.

Also Read: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న మరికొన్ని రైళ్లు.. వివరాలివే..!

 

Loading...
Unable to load recommendations.
Follow Us