ఢిల్లీలో మ‌రో మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం

|

Aug 10, 2020 | 3:55 PM

ఢిల్లీలో ఇటీవ‌ల‌ 12 ఏళ్ల బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డి దారుణంగా గాయ‌ప‌రిచిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా క‌ల‌కలం రేపిన విష‌యం తెలిసిందే. దీనిపై ఢిల్లీలో ఆందోళ‌న‌లు చెల‌రేగాయి.

ఢిల్లీలో మ‌రో మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం
Follow us on

Delhi Minor Rape : ఢిల్లీలో ఇటీవ‌ల‌ 12 ఏళ్ల బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డి దారుణంగా గాయ‌ప‌రిచిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా క‌ల‌కలం రేపిన విష‌యం తెలిసిందే. దీనిపై ఢిల్లీలో ఆందోళ‌న‌లు చెల‌రేగాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్వ‌యంగా ఆస్ప‌త్రికి వెళ్లి బాధిత బాలిక ఆరోగ్య ప‌రిస్థితి తెలుసుకోని వ‌చ్చారు. వారి కుటుంబ స‌భ్యుల‌కు న్యాయం చేస్తామ‌ని హామి ఇచ్చారు. ఈ ఘ‌ట‌న జ‌రిగి కొన్ని రోజులు కూడా గ‌డ‌వ‌క‌ముందే దేశ రాజ‌ధానిలో మ‌రో మైన‌ర్ బాలిక అత్యాచారానికి గురైన‌ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. వాయివ్య ఢిల్లీలో ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితుడు అదే ప్రాంతానికి చెందిన వ్య‌క్తిగా గుర్తించిన పోలీసులు..అత‌డిని అరెస్ట్ చేశారు. బుధ‌వారం రోజున నిందితుడు బాధిత బాలిక‌ను త‌న ఇంటికి రావాల్సిందిగా కోరాడు. అందుకు ఆమె నిరాక‌రించింది. దీంతో అత‌డే బాలిక ఇంటికి వెళ్లి ఆమె బ‌ల‌వంతంగా త‌న ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అనంత‌రం బాలిక‌ను ఓ ఆస్ప‌త్రి ముందు దించి పారిపోయాడు.

‘మాకు ఆస్ప‌త్రి నుంచి ఫోన్ వ‌చ్చింది. బాలిక ప్రైవేట్ పార్ట్స్‌లో గాయాల అయిన‌ట్లు వైద్యులు గుర్తించారు. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది’ అని సీనియ‌ర్ పోలీసు అధికారి తెలిపారు. నిందితుడిపై ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసిన‌ట్టు తెలిపారు.

 

Also Read : రైస్​ కుక్కర్​తో ఫేస్​ మాస్క్​ల శానిటైజ్ ‌చేయొచ్చ‌ట‌‌ !