వివేకా హత్య కేసులో కీల‌క అప్ డేట్…

|

Jul 23, 2020 | 11:18 PM

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణను సీబీఐ వేగవంతం చేసింది. హత్య కేసు ఛేదించడానికి సీబీఐ అధికారులు టెక్నిక‌ల్ టీమ్ ను రంగంలోకి దించారు.

వివేకా హత్య కేసులో కీల‌క అప్ డేట్...
Follow us on

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణను సీబీఐ వేగవంతం చేసింది. హత్య కేసు ఛేదించడానికి సీబీఐ అధికారులు టెక్నిక‌ల్ టీమ్ ను రంగంలోకి దించారు. ముగ్గురు సభ్యుల సాంకేతిక బృందం… వివేకా, మరికొంద‌రి అనుమానితుల కాల్ డేటాను విశ్లేషించ‌నుంది. హత్య జరిగిన రోజు వివేకా ఫోన్​కు ఎవరి వ‌ద్ద నుంచి కాల్స్ వ‌చ్చాయి..ఆయ‌న ఎవ‌రికి ఫోన్ చేశారో పూర్తి స్థాయి డేటా సేక‌రించ‌నున్నారు. అనుమానితులు ఎవరెవరితో మాట్లాడారు..ఎవ‌రికైనా సంక్షిప్త సందేశాలు పంపారా… విషయాలను సీబీఐ సాంకేతిక బృందం పరిశీలించనుంది.

ఈ కేసులో ఆరో రోజు వాచ్​మెన్ రంగన్నను విచారించారు సీబీఐ అధికారులు. శుక్రవారం నుంచి అనుమానితులను పూర్తిస్థాయిలో విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసు విష‌యంలో త్వ‌ర‌లోనే కీల‌క విష‌యాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి.