AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈసీ పనితీరు భేష్: ప్రణబ్ ముఖర్జీ

ఈసీ పనితీరుపై గగ్గోలు పెడుతున్న పొలిటికల్ పార్టీలకు పెద్ద షాక్ ఇచ్చారు భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఈ ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించినందుకు ఈసీని ఆయన అభినందించారు. తొలి ఎన్నికల సంఘం కమిషనర్ సుకుమార్ నుంచి నేటి కమిషనర్ వరకూ ఎన్నికల సంఘం ప్రతిభావంతంగా ఎన్నికలు నిర్వహించిందని కితాబిచ్చారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 67శాతం ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ప్రణబ్ చెప్పారు. ఎన్నికల సంఘాన్ని అదే పనిగా విమర్శించవద్దంటూ రాజకీయ […]

ఈసీ పనితీరు భేష్: ప్రణబ్ ముఖర్జీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 21, 2019 | 12:48 PM

Share

ఈసీ పనితీరుపై గగ్గోలు పెడుతున్న పొలిటికల్ పార్టీలకు పెద్ద షాక్ ఇచ్చారు భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఈ ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించినందుకు ఈసీని ఆయన అభినందించారు. తొలి ఎన్నికల సంఘం కమిషనర్ సుకుమార్ నుంచి నేటి కమిషనర్ వరకూ ఎన్నికల సంఘం ప్రతిభావంతంగా ఎన్నికలు నిర్వహించిందని కితాబిచ్చారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 67శాతం ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ప్రణబ్ చెప్పారు. ఎన్నికల సంఘాన్ని అదే పనిగా విమర్శించవద్దంటూ రాజకీయ పార్టీలకు హితవు పలికారు. దీంతో ఎన్నికల సంఘంపై పదేపదే విమర్శలు చేస్తోన్న టీడీపీ సహ పొలిటికల్ పార్టీలకు ప్రణబ్ ముఖర్జీ గట్టి చురకలే అంటించినట్లైంది.