విజయవాడ వస్తున్న విమానంపై పిడుగు.. ప్రయాణీకులు సురక్షితం!
ఎయిర్ ఇండియా విమానం శనివారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియాకి చెందిన ఓ విమానం పిడుగుపాటుకు గురైంది. ఎయిర్ ఇండియాకు చెందిన AI-467 విమానం శనివారం రాత్రి 7.28 గంటల సమయంలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. ఇది 9.40 గంటలకు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే.. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఈ విమానం వర్షంలో చిక్కుకుపోయింది. టేకాఫ్ అయి గాల్లో ఉండగా.. ఉరుములు, […]
ఎయిర్ ఇండియా విమానం శనివారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియాకి చెందిన ఓ విమానం పిడుగుపాటుకు గురైంది. ఎయిర్ ఇండియాకు చెందిన AI-467 విమానం శనివారం రాత్రి 7.28 గంటల సమయంలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. ఇది 9.40 గంటలకు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే.. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఈ విమానం వర్షంలో చిక్కుకుపోయింది. టేకాఫ్ అయి గాల్లో ఉండగా.. ఉరుములు, పిడుగుల వర్షం కురిసింది. అదే సమయంలో విమానం పిడుగు ప్రభావానికి గురైనట్లు సమాచారం. పిడుగు ప్రభావానికి విమానం షేక్ అవ్వడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విమానంలోని వస్తువులు, ఆహార పదార్థాలు చెల్లాచెదురయ్యాయి. విమాన క్రూ సిబ్బంది కూడా గాయపడ్డట్లు సమాచారం. పిడుగు కారణంగా విమానం కూడా పాక్షికంగా దెబ్బతింది. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని.. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఘటనపై ఎయిర్ ఇండియా విచారణ చేపడుతుందని.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
Air India’s AI-467 Delhi to Vijayawada flight suffered damages and crew suffered injuries when the aircraft faced severe thunderstorm. No passengers were reported injured in the incident. Air India has started the investigation in this matter. pic.twitter.com/gCs6NF2XTR
— ANI (@ANI) September 21, 2019