ప్రముఖ హాస్యనటుడు ఆలీ ఇంట విషాదం నెలకొంది. ఆలీ తల్లి జైతున్ బాబీ(57) అనారోగ్యంతో నిన్న అర్థరాత్రి కన్ను మూశారు. రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆమె తుది శ్వాస విడిచారు. అయితే.. ఈ విషయం తెలుసుకున్న ఆలీ.. రాంచీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఆలీ జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. కాగా.. జైతున్ బీబీ భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం హైదరాబాద్ తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్లోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారని సమాచారం.
కాగా.. ఆలీకి తన తల్లి అంటే ఎంతో ప్రేమ. పలు కార్యక్రమాల్లో.. తన తల్లిని గుర్తుచేసుకుని బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం తల్లిదండ్రులే కారణమని చెబుతూంటారు. వీలు చిక్కినప్పుడల్లా.. ఆమెతో సమయం గడిపేందుకు ఇష్టపడేవారు ఆలీ.