కరోనా మార్గదర్శకాలను ఉల్లంఘించి క్రికెట్ మ్యాచ్.. 51మందిపై కేసు..!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కొందరు ఆకతాయిలు

కరోనా మార్గదర్శకాలను ఉల్లంఘించి క్రికెట్ మ్యాచ్.. 51మందిపై కేసు..!

Updated on: Jul 05, 2020 | 4:42 AM

Cricket match in Greater Noida: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కొందరు ఆకతాయిలు క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరిగింది ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన మ్యాచ్ జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. కరోనా మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు అక్కడ ఉన్న 51మందిపై కేసు నమోదు చేశారు. అలాగే గ్రౌండ్‌కు రావడానికి వారు ఉపయోగించిన 17 కార్లకు చలానా విధించారు.

Also Read: యాంటీ-వైరల్ డ్రగ్ రెమ్డిసివిర్ డోసేజ్‌లో మార్పులు: కేంద్రం

Follow Us