ఆ 17 జిల్లాల్లో.. రేడియో పాఠాలు వింటున్న.. 3.70 ల‌క్ష‌ల చిన్నారులు!

| Edited By:

Aug 10, 2020 | 4:09 PM

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటివరకు విద్యాసంస్థలు తెరుచుకోలేదు. అయితే ఇప్పుడు రేడియో సాయంతో విద్యావ్యాప్తి జ‌రుగుతోంది. క‌రోనా నేప‌ధ్యంలో విధించిన నిబంధ‌న‌ల కార‌ణంగా విద్యార్థులు

ఆ 17 జిల్లాల్లో.. రేడియో పాఠాలు వింటున్న.. 3.70 ల‌క్ష‌ల చిన్నారులు!
Follow us on

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటివరకు విద్యాసంస్థలు తెరుచుకోలేదు. అయితే ఇప్పుడు రేడియో సాయంతో విద్యావ్యాప్తి జ‌రుగుతోంది. క‌రోనా నేప‌ధ్యంలో విధించిన నిబంధ‌న‌ల కార‌ణంగా విద్యార్థులు పాఠ‌శాల‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దీనిని గ‌మ‌నించిన స్వ‌చ్ఛంద సంస్థ‌ ప్ర‌ధ‌మ సంస్థాన్‌, నాగ‌పూర్ ఆకాశ‌వాణి కేంద్రం సంయుక్తంగా మహారాష్ట్రలోని 17 జిల్లాల్లో రేడియో స్కూల్‌ను ప్రారంభించాయి. ఈ రేడియో స్కూల్ ద్వారా ప్ర‌స్తుతం 4,500 గ్రామాలకు చెందిన మూడున్నర లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

ఈ క్రమంలో నాగ్‌పూర్ డివిజనల్ కమిషనర్ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ రేడియో ద్వారా విద్యార్థుల‌కు చ‌దువు చెప్పాల‌నే ప్రయత్నం విజ‌య‌వంత‌మ‌య్యింద‌ని అన్నారు. ఈ విధానం అమ‌లు కోసం ఏప్రిల్‌లో 7 జిల్లాల్లో సర్వే నిర్వ‌హించామ‌న్నారు. ఈ విధంగా ఫీడ్‌బ్యాక్ సేక‌రించి, రేడియో స్కూల్ ప్రారంభించామ‌న్నారు. త‌ల్లిదండ్రుల‌కు వాట్సాప్ ద్వారా సిల‌బ‌స్ ముందుగా పంపిస్తామ‌న్నారు. మొబైల్ ఫోన్లు, రేడియోలు లేనివారి కోసం గ్రామ పంచాయ‌తీల వ‌ద్ద లౌడ్ స్పీక‌ర్లు ఏర్పాటుచేసి, విద్యార్థుల‌కు పాఠాలు బోధిస్తున్నామ‌న్నారు.

Read More:

గుడ్ న్యూస్: తెలంగాణ ఆస్పత్రుల్లో ఇక ఆర్‌టీ-పీసీఆర్‌ ద్వారా కరోనా టెస్ట్..!

తెలంగాణలో కొలువుల జాతర.. కార్మిక ఉపాధి కల్పన శాఖ కొత్త ప్లాన్‌..!