AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’కి భారీ భద్రత..!

గుజరాత్‌లోని కెవాడియాలో ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో నిర్మించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంను పటేల్ 143వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ 2018, అక్టోబర్ 31న ఆవిష్కరించారు. ఈ విగ్రహం వద్ద సీఐఎస్‌ఎఫ్

‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’కి  భారీ భద్రత..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 19, 2020 | 10:43 PM

Share

గుజరాత్‌లోని కెవాడియాలో ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో నిర్మించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంను పటేల్ 143వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ 2018, అక్టోబర్ 31న ఆవిష్కరించారు. ఈ విగ్రహం వద్ద సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని మోహరించడానికి కేంద్ర హోం  మంత్రిత్వశాఖ అనుమతినిచ్చింది. మొదటి దశలో భాగంగా ఆగస్టు 25 నుంచి 272 మంది సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సీఐఎస్ఎఫ్ డీజీ రాజేశ్ రంజన్‌కు లేఖ రాసినట్టు హోంశాఖ పేర్కొంది. దేశరాజధానిలోని కీలక ప్రభుత్వ కార్యాలయాలు, ఢిల్లీ మెట్రో స్టేషన్లు, దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో సీఐఎస్‌ఎఫ్‌ దళాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.

Read More:

ఏపీలోని ఆ జిల్లాలో.. 50 ఏళ్లు పైబడిన వారికి.. నో హోమ్‌ ఐసోలేషన్‌..!

జూరాలకు వరద ఉదృతి.. 39 గేట్లు ఎత్తివేత..!