ప్రాణం తీసిన టిక్ టాక్

|

Jun 13, 2019 | 1:38 PM

మనుషులతో బంధాల కంటే ప్రాణాలు టిక్ టాక్‌కే మనుషులు ఎక్కువ విలువనిస్తున్నారు. టిక్ టాక్ వీడియోలు చూడొద్దని భర్త మండలించడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. తాను పురుగుల మందు తాగుతూ ఆత్మహత్య చేసుకోవడాన్ని వీడియో తీసి టిక్‌టాక్ లో పెట్టడం సంచలనంగా మారింది. తమిళనాడులోని వంగారం గ్రామానికి చెందిన అనితతో పళనివేలుకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పళనివేలు సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలతో అనిత పెరంబలూరులో ఉంటోంది. ఇంట్లో ఖాళీగా […]

ప్రాణం తీసిన టిక్ టాక్
Follow us on

మనుషులతో బంధాల కంటే ప్రాణాలు టిక్ టాక్‌కే మనుషులు ఎక్కువ విలువనిస్తున్నారు. టిక్ టాక్ వీడియోలు చూడొద్దని భర్త మండలించడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. తాను పురుగుల మందు తాగుతూ ఆత్మహత్య చేసుకోవడాన్ని వీడియో తీసి టిక్‌టాక్ లో పెట్టడం సంచలనంగా మారింది. తమిళనాడులోని వంగారం గ్రామానికి చెందిన అనితతో పళనివేలుకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పళనివేలు సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలతో అనిత పెరంబలూరులో ఉంటోంది. ఇంట్లో ఖాళీగా ఉంటోన్న అనిత టిక్ టాక్ కు అలవాటు పడింది. పిల్లల్ని పట్టించుకోకుండా డ్యాన్స్‌ చేయడం, పాటలు పాడడం, మేకప్‌ వేసుకోవడం వంటి వీడియోలను నిత్యం యాప్‌లో పోస్టు చేస్తోంది. విషయం తెలుసుకున్న భర్త మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడింది.