సుశాంత్ డ్రగ్స్ అడిక్ట్ కాదు: ప్రత్యక్ష సాక్షి
బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ కేసు పలు మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో డ్రగ్స్ కోణం కూడా బయటపడటంతో
Sushant death case: బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ కేసు పలు మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో డ్రగ్స్ కోణం కూడా బయటపడటంతో రంగంలోకి దిగిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో.. నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరిందా, సుశాంత్ వంటమనిషి దినేష్ సావంత్ సహా పలువురిని అరెస్ట్ చేసింది. కాగా మరోవైపు ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా..? హత్య చేశారా..? ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటి..? అన్న కోణంలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ క్రమంలో ఓ ప్రధాన సాక్షి సీబీఐకి పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. సుశాంత్ డ్రగ్స్కి అడిక్ట్ అవ్వలేదని అతడు సీబీఐకి వెల్లడించినట్లు సమాచారం. అంతేకాదు వాస్తవానికి దూరంగా తీసుకెళ్లే డ్రగ్స్ని తీసుకోవడం సుశాంత్కి ఇష్టం లేదని చెప్పినట్లు టాక్. కాగా మరోవైపు సుశాంత్ కేసులో బాలీవుడ్పై కూడా సీబీఐ దృష్టి పెట్టేందుకు సిద్ధమైంది. వృత్తిపరంగా సుశాంత్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు..? అనే విషయాలపై సీబీఐ ఆరా తీసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
Read More: