10 May 2024

ఆ డైరెక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్న సాయి పల్లవి..

Rajitha Chanti

Pic credit - Instagram

సౌత్ ఇండస్ట్రీలో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ ఇష్టపడే హీరోయిన్ సాయి పల్లవి. ఈ కేరళ కుట్టికి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. 

సాయి పల్లవి పుట్టి పెరిగింది అంతా తమిళనాడు రాష్ట్రంలోనే. కోటగిరి ప్రాంతంలో పుట్టిన ఈ సోగసరి కోయంబత్తూర్లో పెరిగింది. డాక్టర్ డిగ్రీ పూర్తి చేసింది. 

టీవీలో ఐశ్వర్యరాయ్, మాధురి దీక్షిత్  డాన్స్ వీడియోస్ చూసి డాన్స్ నేర్చుకుంది. ఫస్ట్ మూవీలో ప్రేమమ్ చిత్రంలో డాన్స్ అదరగొట్టింది. ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. 

అయితే కథానాయికగా ఎంట్రీ ఇవ్వకముందు సాయి పల్లవి మలయాళీ డైరెక్టర్ అల్ఫోన్స్ పుతరన్ పై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలనుకుందట. అందుకు రీజన్ ఉంది. 

ఢీ షో సమయంలోనే ఫేస్ బుక్‏లో సాయి పల్లవికి మెసేజ్ చేశాడట అల్ఫోన్స్. అయితే ఆ మెసేజ్ గురించి అంతగా పట్టించుకోలేదట. ఆరేళ్ల తర్వాత మళ్లీ మెసేజ్ చేశాడట. 

తన సినిమాలో హీరోయిన్‏గా చేయాలని రిక్వెస్ట్ చేస్తూ తన ఫోన్‏కు ఓ మెసేజ్ వచ్చిందట. అయితే మొదట్లో ఆ మెసేజ్ చూసి ఎవరో ఆట పట్టిస్తున్నారని అనుకుందట. 

పదే పదే అదే నంబర్ నుంచి ఫోన్స్, మెసేజ్‏స్ రావడం చూసి విసుగెత్తిపోయానని.. దీంతో అతడి గురించి పోలీసులకు కంప్లైంట్ చేయాలనుకుందట సాయి పల్లవి. 

చివరకు అల్ఫోన్స్ పుత్ర తన పేరు వికీపిడియాలో చెక్ చేయమని మెసేజ్ రాగా.. గూగుల్‏లో వెతికిందట. ఆ తర్వాత డైరెక్టర్ అని తెలియడంతో చాలా గిల్టీగా ఫీలయ్యిందట.