Telangana: డబ్బులు కట్టేందుకు బ్యాంక్కి వెళ్లగా.. క్యాషియర్ చేసిన పనికి సీన్ కాస్తా సితారయ్యింది.!
తమ గ్రూప్ డబ్బు బ్యాంక్లో కట్టాలని ఓ వ్యక్తి ఏటీఎంకి వెళ్లాడు. తనకు కావాల్సిన నగదును మొత్తం ఏటీఎం నుంచి విత్డ్రా చేశాడు. ఇక ఆ డబ్బును బ్యాంకులో కట్టేందుకు వెళ్లగా.. అక్కడి బ్యాంక్ ఉద్యోగి నోట్లన్నీ లెక్కపెట్టి.. ఒకటి దొంగ నోటు ఉందని చెప్పడంతో దెబ్బకు షాక్ అయ్యాడు బాధితుడు.
తమ గ్రూప్ డబ్బు బ్యాంక్లో కట్టాలని ఓ వ్యక్తి ఏటీఎంకి వెళ్లాడు. తనకు కావాల్సిన నగదును మొత్తం ఏటీఎం నుంచి విత్డ్రా చేశాడు. ఇక ఆ డబ్బును బ్యాంకులో కట్టేందుకు వెళ్లగా.. అక్కడి బ్యాంక్ ఉద్యోగి నోట్లన్నీ లెక్కపెట్టి.. ఒకటి దొంగ నోటు ఉందని చెప్పడంతో దెబ్బకు షాక్ అయ్యాడు బాధితుడు. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పద్మావతి నగర్లో ఉన్న ఏటీఎంలో గురువారం గంగాధర్ అనే వ్యక్తి రూ. 8500 డబ్బులు విత్డ్రా చేశాడు. బ్యాంక్లో గ్రూపు డబ్బులు కట్టేందుకు.. ఆ డబ్బును కాస్తా బ్యాంక్కు తీసుకెళ్లాడు. ఆ డబ్బులు బ్యాంక్లో కట్టగా.. ఒక్క నోటు డూప్లికేట్ది వచ్చిందని.. నోటుపై గీతలు గీసి సదరు బాధితుడి చేతిలో పెట్టాడు క్యాషియర్. సదరు బాధితుడు క్యాష్ విత్డ్రా చేసిన ఏటీఎం దగ్గరకు వెళ్లి.. విషయాన్ని వివరించగా.. ఆ నోటుతో తమ బ్యాంకుకు సంబంధం లేదని అక్కడి అధికారులు చెప్పినట్టు వాపోయాడు. ఆటో డ్రైవర్గా జీవిస్తున్న తనకు దొంగ నోటు రావడంతో ఒకరోజు సంపదన పోయిందని వాపోయాడు బాధితుడు. ఇలాంటి ఘటన ఇంకా ఎవరికి జరగకూడదని బాధితుడు అన్నాడు.