హైదరాబాద్లో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్లు
హైదరాబాద్లో ఐపీఎల్ బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటి నుంచే రంగంలోకి దిగిన కొన్ని ముఠాలు.. ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నాయి.
Hyderabad IPL Betting: హైదరాబాద్లో ఐపీఎల్ బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటి నుంచే రంగంలోకి దిగిన కొన్ని ముఠాలు.. ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నాయి. వీటిపై దాడులు చేస్తున్న టాస్క్ఫోర్స్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాలను అరెస్ట్ చేశారు. అంతర్రాష్ట్ర ముఠాలు ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం సైబరాబాద్లో రాజస్థాన్కి చెందిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ( కరోనా అప్డేట్స్: తెలంగాణలో 1,637 కొత్త కేసులు.. 6 మరణాలు)
ప్రతి ఏరియాలో ఏజెంట్లను పెట్టుకొని ముఠాలు బెట్టింగ్ నిర్వహిస్తున్నాయి. బెట్టింగ్కి సంబంధించిన లావాదేవీలు అన్ని ఆన్లైన్ ద్వారానే జరుపుతున్నారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లలో పెద్ద మొత్తంలో యువకులు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సోమవారం పంజాగుట్టలో క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు అన్నీ పోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ( అతడిపై న్యాయపోరాటానికి సిద్ధమైన అమలా పాల్)
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సోను కుమార్ కొంతకాలంగా ఐపీఎల్ బెట్టింగ్లో పాల్గొని తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నాడు. పంజాగుట్ట ద్వారకపురి కాలనీలో స్నేహితులతో కలిసి ఉంటూ కొబ్బరి బోండాలు విక్రయించేవాడు. డబ్బులు పోగొట్టుకోవడంతో ఇంట్లో గ్రిల్కి ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ( Bigg Boss 4: నామినేషన్లో ఉన్న వారికి బిగ్బాస్ ఆఫర్.. కానీ)