ఇండోనేషియా ఓపెన్ నేటి నుంచే.. టైటిల్ వేటలో భారత షట్లర్లు
పివి సింధు, కిదాంబి శ్రీకాంత్ ఇండోనేషియా ఓపెన్ టైటిట్ పై గురిపెట్టారు. నెలరోజుల బ్రేక్ తర్వాత సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నారు. గత డిసెంబర్లో వరల్డ్ టూర్ ఫైనల్లో విజేతగా నిలిచిన సింధు.. తాజాగా సీజన్లో ఇంతవరకూ బోణీ కొట్టలేకపోయింది. దీంతో నేడు మొదలయ్యే ఇండోనేషియా ఓపెన్లో ఎలాగైనా టైటిల్ దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అయా ఒహోరీతో సింధు తలపడనుంది. ముందుకు సాగితే క్వార్టర్స్లో నజోమి ఒకుహరా రూపంలో […]
పివి సింధు, కిదాంబి శ్రీకాంత్ ఇండోనేషియా ఓపెన్ టైటిట్ పై గురిపెట్టారు. నెలరోజుల బ్రేక్ తర్వాత సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నారు. గత డిసెంబర్లో వరల్డ్ టూర్ ఫైనల్లో విజేతగా నిలిచిన సింధు.. తాజాగా సీజన్లో ఇంతవరకూ బోణీ కొట్టలేకపోయింది. దీంతో నేడు మొదలయ్యే ఇండోనేషియా ఓపెన్లో ఎలాగైనా టైటిల్ దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అయా ఒహోరీతో సింధు తలపడనుంది. ముందుకు సాగితే క్వార్టర్స్లో నజోమి ఒకుహరా రూపంలో సింధుకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. కాగా, గాయాలతో బాధపడుతున్న మరో టాప్ షట్లర్ నెహ్వాల్ ఈ టోర్నీకి దూరమయ్యింది. ఇక కిదాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో బరిలోకి దిగనున్నాడు. సాయి ప్రణీత్, ప్రణయ్ కూడా ఆడనున్నారు. డబుల్స్లో సాత్విక సాయిరాజ్, అశ్వినీ పొన్నప్ప, మిక్స్డ్లో సిక్కిరెడ్డి జోడీలు బరిలో నిలవనున్నాయి. ఈ సీజన్లో సైనా తప్ప ఎవరూ టైటిల్ సాధించలేక పోయారు. అయితే, గాయాల కారణంగానే భారత షట్లర్లు ఆశించిన మేరకు రాణించలేకపోయారని కోచ్ గోపీచంద్ అన్నాడు. కోచింగ్ విధానంలో కొన్ని మార్పులు చేశామని.. ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తారనే నమ్మకం ఉందని చెప్పాడు.