త్వరలో ఎన్ 100 మాస్క్.. దీని ప్రత్యేకత ఏంటంటే..?
కరోనా మహమ్మారి మనుషులకు ఎన్నో కొత్త అలవాట్లను నేర్పింది. కాదు కాదు.. పూర్వం ఉన్న పద్దతులను మళ్లీ గుర్తుచేస్తోంది. కరోనా సోకకుండా ఉండాలంటే మనుషులు ఖచ్చితంగా మాస్క్లు..
కరోనా మహమ్మారి మనుషులకు ఎన్నో కొత్త అలవాట్లను నేర్పింది. కాదు కాదు.. పూర్వం ఉన్న పద్దతులను మళ్లీ గుర్తుచేస్తోంది. కరోనా సోకకుండా ఉండాలంటే మనుషులు ఖచ్చితంగా మాస్క్లు ధరించాల్సిందే. అంతేకాదు.. నిత్యం చేతులను శుభ్రంగా కడుక్కోవడంతో పాటు.. సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందే. అయితే ప్రస్తుతం అంతా మాస్క్లను ఉపయోగిస్తున్నారు. ఇందులో అనేక రకాలు ఉన్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ను నిలువరించేందుకు ఎన్95 మాస్క్లను వాడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో వీటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. అయితే వీటికి కొన్నింటికి వాల్ ఉండటంతో అవి కరోనాను నిలువరించలేవన్న వార్తలు వినిపించాయి. దీంతో ఇప్పుడు ఎన్-100 మాస్క్ను తయారు చేసింది ఓ సంస్థ. ఈ మాస్క్ గాలిని 99.97% ఫిల్టర్ చేస్తుంది. దీనిని ఎక్సెల్ 3 డీ అడ్వాన్స్ టెక్నాలజీ అనే ఓ సంస్థ తయారు చేసింది. ముంబైకి చెందిన ఓ ఇద్దరు యువకులు.. ఫ్రంట్ లైన్ వారియర్స్ కష్టాలను చూసి.. దీనిని డెవలప్ చేశారు. దీనికి ‘ఎక్స్డీ 100’అని నామకరణం చేశారు. అయితే ఇలాంటి మాస్కులను ప్రపంచంలో ఇప్పటివరకూ 9 కంపెనీలు మాత్రమే రెడీ చేస్తున్నాయని తెలిపారు.ఈ ఎన్-100 ఒక్కో మాస్కు ధర రూ .1200 ఉండనుంది. అధికారికంగా అనుమతులు లభించిన వెంటనే. వీటిని మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
Read More :
కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములుకు కరోనా