నిరుద్యోగులకు ఐబీఎమ్ సంస్థ గుడ్న్యూస్
ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై కరోనా ప్రభావాన్ని చూపింది. ఈ మహమ్మారి సృష్టించిన అలజడి నేపథ్యంలో దేశంలో ఇప్పటికే వేలాది మంది ఉద్యోగాలు పోయాయి.
ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై కరోనా ప్రభావాన్ని చూపింది. ఈ మహమ్మారి సృష్టించిన అలజడి నేపథ్యంలో దేశంలో ఇప్పటికే వేలాది మంది ఉద్యోగాలు పోయాయి. మరికొంతమంది తమ ఉద్యోగం ఉంటుందో, పోతుందో అన్న అనుమానంతోనే బిక్కుబిక్కుమంటూ జాబ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్లోని నిరుద్యోగులకు అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎమ్ శుభవార్తను తెలిపింది. ఐబీఎమ్ వెబ్సైట్ లింకిడ్ ఇన్ పేజీలో 500 ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించింది.
తమ సంస్థలో మేనేజర్లు, మిడిల్వేర్ అడ్మినిస్టేటర్లు, డేటా సైంటిస్ట్లు, నెట్వర్క్ , క్లౌడ్ ఆర్కిటెక్ట్లు తదితర కేటగిరీలలో ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నట్లు ఐబీఎమ్ వెల్లడించింది. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఐబీఎమ్లో 3,50,00మంది ఉద్యోగులు పనిచేస్తుంటే, అందులో మూడో వంతు భారత్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో భారత్లో 500 కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టబోతుంటే.. అమెరికాలో మాత్రం 400 ఉద్యోగులను నియమించింది. దీంతో అమెరికాలోని నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
Read This Story Also: సుశాంత్తో మీ కాంట్రాక్ట్ కాపీ ఇవ్వండి: ‘యశ్రాజ్’ను కోరిన పోలీసులు