
Independence Day: భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందింది. 1950 జనవరి 26న దాని రాజ్యాంగం ఆమోదించింది. ఇది భారతదేశాన్ని ఒక ప్రజాస్వామ్య, సార్వభౌమ, గణతంత్ర దేశంగా ప్రకటించింది. భారతదేశ జాతీయ పతాకమైన త్రివర్ణ పతాకం, దేశ స్వాతంత్ర్యానికి, ఐక్యతకు, ప్రజాస్వామ్య విలువలకు, జాతీయ గర్వానికి ప్రతీక. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడల్లా లక్షలాది మంది భారతీయులు గర్వం, గౌరవం, దేశభక్తి భావనలను పొందుతారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యక్రమాలు, జాతీయ పండుగలు, క్రీడా కార్యక్రమాల నుండి అంతర్జాతీయ వేదికల వరకు, త్రివర్ణ పతాకం భారతదేశానికి ఒక ప్రత్యేక చిహ్నంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా గౌరవప్రదంగా ఎగురవేస్తారు.
ప్రతి సంవత్సరం జూలై 22వ తేదీని జాతీయ పతాక దినోత్సవంగా జరుపుకుంటారు. 1947, జూలై 22వ తేదీన, భారత రాజ్యాంగ పరిషత్తు ప్రస్తుత త్రివర్ణ పతాకాన్ని స్వతంత్ర భారతదేశ జాతీయ పతాకంగా స్వీకరించింది. అందువల్ల, ఈ తేదీ భారత చరిత్రలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయినప్పటికీ, స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) లేదా గణతంత్ర దినోత్సవం (జనవరి 26) వంటి జాతీయ సెలవు దినం కాదు. కానీ త్రివర్ణ పతాకం చరిత్ర, ప్రాముఖ్యతను గుర్తుచేసుకునే సందర్భంగా పరిగణిస్తారు. 2026లో జాతీయ పతాక దినోత్సవం ఎప్పుడు, దాని చారిత్రక ప్రాముఖ్యత ఏమిటి? అలాగే ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిన భారత త్రివర్ణ పతాకానికి సంబంధించిన 10 ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
1947లో ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో మనదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని మొదట అనుకున్నా ఆగస్ట్ నెలనే నిర్ణయించడానికి కారణం.. రెండవ ప్రపంచ యుద్ధంలో అల్లైడ్ ఫోర్స్ దేశాల( ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్, చైనా) జట్టుకు కమాండర్గా వున్న లార్డ్ మౌంట్ బాటెన్ ముందు 1945, ఆగష్టు15న జపాన్ ఎంపరర్ ‘హిరోహితో’ నాయకత్వంలో జపాన్ ఆర్మీ లొంగిపోయి మోకరిల్లింది. ఇది మౌంట్ బాటెన్కు లక్కియస్ట్ డేగా తన జీవితంలోనూ, ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిన రోజు అందుకే ఈ తేదీని ఎంపిక చేశారు.
భారత రాజ్యాంగ పరిషత్తు 1947 జూలై 22న ప్రస్తుత త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా స్వీకరించింది. కొన్ని వారాల తర్వాత 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం రావడంతో ఈ త్రివర్ణ పతాకం స్వతంత్ర భారతదేశానికి చిహ్నంగా మారింది.
త్రివర్ణ పతాకం మధ్యలో ఉన్న అశోక చక్రం, సారనాథ్లోని అశోక స్తంభం నుండి ప్రేరణ పొందింది. దీనికి 24 ఆకులు ఉన్నాయి. ఇవి వేగం, మతం, నిరంతర పురోగతి అనే భావనకు ప్రతీకలుగా పరిగణించబడతాయి.
ఇది కూడా చదవండి: UPI Charges: యూపీఐ ఛార్జీలు వ్యాపారులకు మాత్రమే.. వినియోగదారులకు కాదు.. కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి