
హోలిస్టిక్ హెల్త్ న్యూట్రిషనిస్ట్ ఖుషీ ఛబ్రా వెల్లడించిన వివరాల ప్రకారం.. అనాస పండులో ఉండే ‘బ్రోమెలైన్’ అనే ఎంజైమ్ వాపును తగ్గించి, గర్భాశయ కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. దీనికి తోడు దాల్చినచెక్కలోని ‘సిన్నమాల్డిహైడ్’ రక్త ప్రసరణను మెరుగుపరిచి నొప్పిని తగ్గిస్తుంది. అయితే, ఈ చిట్కా ఎంతవరకు శాస్త్రీయమైనది? ఎవరెవరు దీనిని తీసుకోకూడదు? నిపుణుల విశ్లేషణ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఎలా పనిచేస్తుంది?
అనాస పండు :
ఇందులోని బ్రోమెలైన్ ఎంజైమ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది పీరియడ్స్ సమయంలో గర్భాశయ కండరాల సంకోచాన్ని తగ్గించి, నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది.
దాల్చినచెక్క :
ఇది శరీరంలో రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. అనేక పరిశోధనల ప్రకారం, పీరియడ్స్ మొదటి 2-3 రోజుల్లో 1 నుండి 3 గ్రాముల దాల్చినచెక్క పొడిని తీసుకోవడం వల్ల నొప్పి తీవ్రత తగ్గుతుంది.
రక్తాన్ని పలచబరిచే మందులు: ఇప్పటికే బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వారు లేదా రక్తస్రావం సమస్యలు ఉన్నవారు బ్రోమెలైన్ సప్లిమెంట్లకు దూరంగా ఉండాలి. పండుగా తినడం సురక్షితమే.
గర్భిణీలు: గర్భవతులు అధిక మొత్తంలో బ్రోమెలైన్ తీసుకోవడం శ్రేయస్కరం కాదు.
లివర్ సమస్యలు: దాల్చినచెక్కను అతిగా తీసుకోవడం వల్ల కాలేయంపై ప్రభావం పడే అవకాశం ఉంది, కాబట్టి పరిమితంగా వాడాలి.
డయాబెటిస్: మధుమేహం ఉన్నవారు దాల్చినచెక్కను మందుల రూపంలో తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
ఎలా తీసుకోవాలి?:
నెలసరి సమయంలో కొన్ని అనాస పండు ముక్కలపై కొద్దిగా దాల్చినచెక్క పొడిని చల్లుకుని తినవచ్చు. లేదా వేడి నీటిలో దాల్చినచెక్క వేసి టీ లాగా మరిగించి తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. నొప్పి తీవ్రంగా ఉంటే లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ఖచ్చితంగా గైనకాలజిస్ట్ను సంప్రదించాలి.