
ప్రస్తుత రోజుల్లో చాలా మంది వంటల్లో అయోడిన్ కలిపిన ఉప్పు బదులుగా హిమాలయ పింక్ ఉప్పు, కల్లు ఉప్పు వాడుతున్నారు. రుచి, రంగు వేరుగా ఉండటం వల్ల ఈ ఉప్పులు బాగా వాడుకలోకి వస్తున్నా.. వాటిలో అయోడిన్ తక్కువగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడంలో సమస్యలు వస్తున్నాయి. అయోడిన్ లేకపోవడం వల్ల ముఖ్యంగా థైరాయిడ్ సంబంధిత అనారోగ్యాలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మన శరీరంలో చాలా ముఖ్యమైన సూక్ష్మ ఖనిజం అయోడిన్. ఇది మన థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేసేలా చూస్తుంది. అయోడిన్ లేకపోతే.. గొంతు పెద్దగా వాచడం, హార్మోన్ల సమతుల్యత లోపించడం, గర్భిణీ స్త్రీల శిశువు మెదడు అభివృద్ధిలో సమస్యలు లాంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మార్కెట్ లో దొరికే సాధారణ తెల్ల ఉప్పు, అయోడిన్ తో కలిపి ఉంటుంది. దీనిలో ఉండే అయోడిన్ శాతం శరీరానికి అవసరమైన స్థాయిలో ఉంటుంది. అందుకే ఈ ఉప్పును వాడటం వల్ల మనం రోజువారీ అయోడిన్ ను తీసుకోవచ్చు.
మన ఆరోగ్యానికి ముందు ప్రాధాన్యత ఇచ్చి రుచి కోసం శరీరానికి అవసరమైన ఖనిజాలను వదులుకోకూడదు. అయోడిన్ తగినంత వాడుతూ దాని పూర్తి ప్రయోజనాలను పొందడం చాలా అవసరం. కల్లు ఉప్పు, పింక్ ఉప్పు లాంటి కొత్త ఉప్పులను పూర్తిగా మానేయడం సరికాదు. వాటిని సరైన పరిమాణంలో మాత్రమే వాడాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)