
కానీ ఇప్పుడు మార్కెట్లో మామిడి పండ్లు నాచురల్గా పండటం కంటే కెమికల్స్ వేసి తొందరగా పండించినవే ఎక్కువగా కనబడుతున్నాయి. ఇవి చూడటానికి బాగుంటాయి కానీ లోపల మన ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తాయి. బయట బంగారు రంగులో మెరుస్తున్నా.. మన ఆరోగ్యాన్ని పాడు చేసే గుణాలు వాటిలో ఉంటాయి.
చాలా మంది వ్యాపారులు పండ్లు తొందరగా పండటానికి కాల్షియం కార్బైడ్ అనే డేంజర్ కెమికల్ను వాడుతున్నారు. ఈ కెమికల్ తో పండిన మామిడి పండ్లు తింటే మన కడుపు మీద ఎఫెక్ట్ చూపి ఆరోగ్యం పాడవుతుంది. కడుపు నొప్పి, వాంతులు, దద్దుర్లు లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
బయటకు మెరిసిపోతూ చూడటానికి చాలా బాగుండటంతో మనం మోసపోవడం చాలా సులువు. నాచురల్గా పండిన మామిడి పండ్లకు తియ్యటి వాసన వస్తుంది. కానీ కెమికల్స్తో పండించిన వాటికి అలాంటి వాసన ఉండదు. అలా వాసన లేకపోతే అవి నాచురల్ గా పండలేదని గుర్తుంచుకోవాలి.
ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే నేరుగా రైతుల దగ్గర నుంచి పండ్లు కొనడం మంచిది. రైతు బజార్లలో, ఊర్లలో అమ్మే నాచురల్ పండ్లే మన ఆరోగ్యానికి మంచి చేస్తాయి. అవి కెమికల్స్ లేకుండా నాచురల్ పద్ధతిలో పండిస్తారు.
మామిడి పండ్లు నాచురల్గా పండాలంటే వరిగడ్డి లేదా తాటి చెక్కల మీద పెట్టి వాటి వేడితో పండిస్తారు. ఇలా పండిన వాటిలో నాచురల్ రుచి, వాసన ఉంటాయి. అలాంటి పండ్లు తింటే మన శరీరానికి ఎలాంటి నష్టం జరగదు.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మామిడి పండ్లు ఇంటికి తెచ్చిన వెంటనే తినకూడదు. కనీసం రెండు రోజులు మంచి నీటిలో వేయాలి. అలా చేస్తే వాటి మీద ఉన్న కెమికల్స్ పోతాయి. ఆ తర్వాత తింటే ప్రమాదాలు తగ్గుతాయి.
గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, పెద్ద వాళ్ళు ఆరోగ్యం గురించి ఆలోచించి పండ్లు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడగానే బాగున్నాయని కొనకుండా నాచురల్ పద్ధతిలో పండిందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది.
మామిడి పండు నిజంగా మన ఆరోగ్యానికి మంచిదే. కానీ అది నాచురల్ గా పండితేనే. కెమికల్స్ తో తొందరగా పండించిన పండ్లు తింటే మన ఆరోగ్యానికి మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. అందుకే ఆలోచించి జాగ్రత్తగా కొనుక్కొని, నాచురల్ గా పండిన పండ్లనే తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.