పెరుగు మరియు పుదీనా: జీర్ణ ఎంజైమ్లు పెరుగులో ఉంటాయి. ఇందులో మెంతి కలిపి తీసుకుంటే గ్యాస్, ఉబ్బరం సమస్య రాకుండా ఉంటుంది. మెంతికూరను పెరుగులో కలుపుకుని తింటే కడుపు ఉబ్బరం సమస్య నయమవుతుంది.
ఇంగువ తీసుకోవడం : కొన్ని కూరగాయలు, పప్పులు తినడం వల్ల గ్యాస్, అపానవాయువు సమస్యలు వస్తాయి. ఈ పప్పులు, కూరగాయలు ఇంగువ కలిపి తినాలి. ఇంగువ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. దీని వాడకంతో పొట్ట సమస్య ఉండదు.
నడవండి: ఎక్కువ కూర్చోవడం వల్ల కడుపు సమస్యలు వస్తాయి. ఆహారం తిన్న తర్వాత కాసేపు నడవడానికి ప్రయత్నించండి. నడవడం వల్ల కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది.
ఆహారం సరిగ్గా జీర్ణం: మీరు ఆహారాన్ని సరిగ్గా నమలకపోతే, దాని జీర్ణక్రియ సరిగ్గా జరగదు. గ్యాస్ సమస్య వస్తుంది. ఆహారాన్ని సరిగ్గా నమలడం ద్వారా, జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. పోషణ మెరుగుపడుతుంది.
నిమ్మరసం: నిమ్మకాయలోని పోషకాలు ఆహారం జీర్ణం కావడానికి సహాయపడతాయి. భోజనానికి అరగంట ముందు నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నిమ్మరసం తాగడం వల్ల కడుపులోని pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఉబ్బరం ఉండదు.