
వాతావరణం మారింది. చాలా ప్రాంతాల్లో ఎండల ప్రభావం కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో.. చాలా ఇళ్లలో ఏసీ వాడకం మొదలయింది. అయితే, మీ ఇంట్లో పిల్లలు ఉండి, మీరు ఏసీని ఉపయోగిస్తుంటే.. చాలా విషయాలను గమనించాలని.. లేకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.. ఏసీలో పిల్లలు పడుకుంటే.. కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.. అయినప్పటికీ, తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే పొరపాట్లు చేస్తుంటారు. మీ ఇంట్లో కూడా పిల్లలుండి.. ఏసీని ఆపరేట్ చేస్తుంటే.. తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు.. లాంటి వివరాలను తెలుసుకుందాం.
ఢిల్లీలోని ఎయిమ్స్ పీడియాట్రిక్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ హిమాన్షు భదానీ.. మాట్లాడుతూ.. మీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మీరు వారి గదిలో ఎయిర్ కండిషనర్ ఉపయోగిస్తుంటే, సరైన ఉష్ణోగ్రతను నిర్వహించడం చాలా ముఖ్యం అని వివరించారు. ఎయిర్ కండిషనర్ ఉష్ణోగ్రత సుమారు 23-27 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. ఏ కాలమైనా సరే, ఉష్ణోగ్రతను తగ్గించడం పిల్లల ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల దగ్గు, జలుబు లేదా అలర్జీలు రావచ్చు. అలాగే, ఎయిర్ కండిషనర్ నుండి వచ్చే గాలి నేరుగా పిల్లలపై పడకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. గాలి నేరుగా పిల్లలపై పడటం వల్ల వారి చర్మానికి కూడా హాని కలగవచ్చు.
ఏసీలో కూడా పిల్లలకు సరైన దుస్తులు వేయాలని డాక్టర్ హిమాన్షు వివరిస్తున్నారు. పిల్లల బట్టలు వారి శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే విధంగా ఉండాలి. ఈ సమయంలో, అధికంగా బట్టలు ధరించకూడదని కూడా గుర్తుంచుకోవాలి.. ఎందుకంటే అవి శరీర ఉష్ణోగ్రతను పెంచి, బయట ఏసీ చల్లగా ఉన్నట్లు అనిపించేలా చేస్తాయి. ఇది ఆరోగ్యం క్షీణించే ప్రమాదాన్ని కలిగిస్తుంది. బట్టలు తేలికగా ఉండి, శరీరాన్ని మాత్రమే కప్పి ఉంచాలి. అలాగే, ఏసీని విరామం లేకుండా నిరంతరం నడపకూడదని గుర్తుంచుకోవాలి. ప్రతి 3 నుండి 4 గంటలకు ఒకసారి ఏసీని కాసేపు ఆపి, అరగంట తర్వాత మళ్లీ ఆన్ చేయాలి.
ఆస్తమా ఉన్నవారు
శ్వాసకోశ వ్యాధి ఉన్నవారు
తీవ్రమైన చర్మ వ్యాధి
ఇటీవల ఇన్ఫెక్షన్ సోకిన వారు..
ఇలాంటి పిల్లలను ఏసీలో పడుకోబెట్టకూడదని.. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏమైనా సందేహాలున్నా.. సమస్యలున్నా.. ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..