దేశ రాజధానిలో భారీ అగ్ని ప్రమాదం..
దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటికే ఢిల్లీలో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నిత్యం ఎక్కడో ఓ చోట.. ఏదో ఓ ప్రమాదం చోటుచేసుకుంటుంది. తాజాగా..
దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటికే ఢిల్లీలో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నిత్యం ఎక్కడో ఓ చోట.. ఏదో ఓ ప్రమాదం చోటుచేసుకుంటుంది. తాజాగా.. ముంద్కా ప్రాంతంలోని ఓ గోదాములో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గోదాములో ఎలక్ట్రానిక్ వస్తువులు, వైద్య పరికరాలు స్టోర్ చేసినట్లు సమాచారం. అగ్నిప్రమాదంలో అవన్నీ కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే.. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పేందుకు 35 ఫైర్ ఇంజన్లతో ప్రయత్నించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అగ్ని మాపక సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
This is a logistics warehouse, there are electronic items & medical equipment inside it. 35 fire tenders are engaged in the fire fighting operation. Reason of the fire is yet to be ascertained. No casualty reported: SK Dua, Divisional Fire Officer #Delhi pic.twitter.com/X3WzOUOkl6
— ANI (@ANI) July 8, 2020