తీవ్రమైన వేడిని ఎదుర్కొని ఆరోగ్యంగా ఉంచేందుకు eRZL రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ హైడ్రేషన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. eRZL బృందం విజయవాడలో క్షేత్రస్థాయిలో ప్రజలను కలిసింది. వేడిలో శ్రమించేటప్పుడు లేదా వ్యాయామం చేసేటప్పుడు శరీరం కేవలం నీటిని మాత్రమే కాకుండా అవసరమైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతుందని, ఇది డీహైడ్రేషన్కు దారితీస్తుందని ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. విజయవాడలోని జనరద్దీ కలిగిన వీధులు, నగరంలోని ప్రధాన ప్రాంతాలలో eRZL బృందం వినియోగదారులతో నేరుగా మాట్లాడింది. రోజువారీ జీవితంలో వేడి తీవ్రత, ప్రయాణం, బహిరంగ కార్యకలాపాల కారణంగా హైడ్రేషన్ కోసం ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపాల్సిన ప్రాముఖ్యతను వివరించింది. డీహైడ్రేషన్ను నివారించడానికి, దీర్ఘకాలం పనిచేసే లేదా అలసిపోయే రోజులలో శక్తిని తిరిగి పొందడానికి ఎలక్ట్రోలైట్ల అవసరాన్ని eRZL డ్రింక్ను తీసుకోవడం ద్వారా వినియోగదారులు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించింది.