రెండు తెలుగు రాష్ట్రాలలో eRZL టీమ్ భారీ హైడ్రేషన్ అవగాహన కార్యక్రమాన్నిచేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా eRZL బృందం ఖమ్మం నగరంలో ప్రజలకు ఎలక్ట్రోలైట్ రీప్లనిష్మెంట్, హైడ్రేషన్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించింది. వేడిలో పని చేసేటప్పుడు లేదా అధిక చెమట పట్టినప్పుడు శరీరం కేవలం నీటిని మాత్రమే కాకుండా, కీలకమైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతుంది. దీనివలన డీహైడ్రేషన్ బారిన పడి అలసట, బలహీనతకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్యను పరిష్కరించే దిశగా eRZL బృందం ఖమ్మంలోని రద్దీగా ఉండే వీధులు, కీలకమైన నగర ప్రాంతాలలో క్షేత్రస్థాయి శాంప్లింగ్ కార్యక్రమాలను నిర్వహించింది. ఈ ఆన్-గ్రౌండ్ యాక్టివేషన్ ద్వారా, వినియోగదారులు తమ సుదీర్ఘమైన పని రోజులు, ప్రయాణాలు, బహిరంగ కార్యకలాపాలు, అధిక వేడి ఉన్న పరిస్థితులలో ఎలక్ట్రోలైట్లను శరీరంలోకి తిరిగి భర్తీ చేయడం ఎంత అవసరమో తెలుసుకున్నారు. eRZL టీమ్ స్థానికులతో ప్రత్యక్షంగా మమేకమై, హైడ్రేషన్ ప్రాముఖ్యతపై సమాచారాన్ని అందించింది. ఖమ్మంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది.