వేసవి వేడిమి నుండి ఉపశమనం కల్పించేందుకు eRZL బృందం తెలుగు రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోని మదనపల్లిలో ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా eRZL బృందం వినియోగదారులను నేరుగా కలిసి.. హైడ్రేషన్ ప్రాముఖ్యత, ఎలక్ట్రోలైట్ రీప్లెనిష్మెంట్ ఆవశ్యకతపై వివరించింది. రోజువారీ జీవితంలో సుదీర్ఘమైన పనులు, ప్రయాణాలు, బహిరంగ కార్యకలాపాలు, అధిక వేడిమిని ఎదుర్కొనే ప్రజలకు హైడ్రేషన్ ఎంత ముఖ్యమో eRZL బృందం వివరించింది. మదనపల్లిలోని రద్దీగా ఉండే వీధులు, ముఖ్యమైన ప్రదేశాలలో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. అలసటను తగ్గించి, శరీరాన్ని చురుకుగా ఉంచడానికి ఎలక్ట్రోలైట్స్ ఎలా సహాయపడతాయో వివరించారు. మదనపల్లిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.