టాలీవుడ్‏లోకి మరో క్రేజీ మల్టీస్టారర్.. ఆ ఇద్దరు స్టార్ హీరోల కోసం స్టోరీ సెట్ చేసిన డైరెక్టర్ ?

|

Jan 26, 2021 | 1:01 PM

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే మల్టీస్టారర్ సినిమాల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే వెంకటేశ్, మహేష్.. వెంకటేశ్, పవన్ కళ్యాణ్, వెంకటేశ్, వరుణ్

టాలీవుడ్‏లోకి మరో క్రేజీ మల్టీస్టారర్.. ఆ ఇద్దరు స్టార్ హీరోల కోసం స్టోరీ సెట్ చేసిన డైరెక్టర్ ?
Follow us on

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే మల్టీస్టారర్ సినిమాల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే వెంకటేశ్, మహేష్.. వెంకటేశ్, పవన్ కళ్యాణ్, వెంకటేశ్, వరుణ్ కాంబోలో మల్టీస్టారర్ సినిమాలు విడుదలకాగా.. తాజాగా జక్కన్న దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ భారీ మల్టీస్టారర్ సినిమా రాబోతుంది. ఈ క్రమంలోనే మరో క్రేజీ మల్టీస్టారర్ సినిమా రాబోతున్నట్లుగా టాలీవుడ్‏లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి యాత్రం ఫేం మహేష్ వి.రాఘవ్ ఓ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ నిర్మించేందుకు మహేష్ వి. రాఘవ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే వీరిద్దరికి కోసం స్క్రిప్ట్‏ను కూడా రెడీ చేసాడట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ మూవీ చేస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుండగా.. ఇందులో రష్మిక మందన హీరోయిన్‏గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం మారెడుపల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే విజయ్ దేవరకొండ కూడా మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే సినిమాను చేస్తున్నాడు. ఇటివలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‏కు విశేషస్పందన లభించింది. ఇక తొందర్లోనే ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత విజయ్, బన్నీ కాంబోలో మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Also Read:

Balakrishna Movie Update: బాలయ్య కోసం రంగంలోకి ఇద్దరు విలన్లు.. బోయపాటి ప్లాన్ మాములుగా లేదుగా..