‘అల వైకుంఠపురములో’ చిత్రంతో మరో హిట్ను ఖాతాలో వేసుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్తో రెండోసారి పనిచేసేందుకు సిద్ధమైన త్రివిక్రమ్.. ఈ మధ్యన అతడికి కథను కూడా వినిపించినట్లు తెలుస్తోంది. ఇక ఈ కథను విన్న ఎన్టీఆర్.. దానికి ముగ్దుడయ్యారని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ మూవీకి స్క్రిప్ట్ తయారు చేసే పనిలో త్రివిక్రమ్ పడ్డట్లు తెలుస్తోంది.
కాగా ఎన్టీఆర్తో ఇదివరకు అరవింద సమేతను తెరకెక్కించారు త్రివిక్రమ్. ఫ్యాక్షన్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కగా.. ఈసారి మాత్రం యంగ్ టైగర్ కోసం పొలిటికల్ బ్యాక్డ్రాప్ను ఎంచుకున్నారట ఈ డైరక్టర్. ఇక ఈ స్క్రిప్ట్ మే లేదా జూన్కు పూర్తి కానుందని సమాచారం. ఆ తరువాత ఆర్ఆర్ఆర్ షూటింగ్ నుంచి ఎన్టీఆర్ బయటకు వచ్చిన తరువాత వీరిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్లుగా పూజా హెగ్డే, రష్మిక పేర్లు వినిపిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించబోతోంది.