వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్న యంగ్ హీరో.. రచయిత కమ్ డైరెక్టర్ సినిమాలో నితిన్..

|

May 04, 2021 | 10:07 PM

Nithiin New Movie: చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు కథానాయకుడు నితిన్‌. చివరిగా ఈ యంగ్ హీరో భీష్మ సినిమాతో హిట్ అందుకున్నాడు.

వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్న యంగ్ హీరో.. రచయిత కమ్ డైరెక్టర్ సినిమాలో నితిన్..
Nithin
Follow us on

Nithiin New Movie: చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు కథానాయకుడు నితిన్‌. చివరిగా ఈ యంగ్ హీరో భీష్మ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇక ఈ ఏడాది వచ్చి ‘చెక్‌’, ‘రంగ్‌ దే’ చిత్రాలు ప్రేక్షకుల్ని అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే నితిన్ హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా చకచక సినిమాలను చేసేస్తున్నాడు నితిన్. ప్రస్తుతం ‘మ్యాస్ట్రో’గా అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ అయిన అందాధున్ చిత్రానికి రీమేక్‏గా నిర్మిస్తున్నారు. ఇక ఇది సెట్స్‌పై ఉండగానే నితిన్‌ మరో కొత్త కథకు పచ్చజెండా ఊపారని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది.

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ దర్శకుడు వక్కంతం వంశీ డైరెక్షన్లో నితిన్‌ ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రచయితగా వక్కంతం వంశీకి మంచి పేరు ఉంది. ఆయన కథలను అందించిన సినిమాలు కొన్ని ఘన విజయాలను అందుకున్నాయి.  ఇక ఈ సినిమాను ఠాగూర్‌ మధు నిర్మించనున్నారు. ఓ విభిన్నమైన యాక్షన్‌ డ్రామా కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని, ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు తుది దశకు చేరుకున్నాయని ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తోంది. ఇందులో కథానాయికగా సాయిపల్లవిని అనుకుంటున్నారట మేకర్స్. ప్రస్తుతం నితిన్‌ చేస్తున్న ‘మ్యాస్ట్రో’ పూర్తి కాగానే.. ఈ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కనున్నారట. ఇదిలా ఉంటే… ఇటీవల నితిన్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే చైతన్య కృష్ణ దర్శకత్వంలో పవర్ పేట అనే సినిమా చేయబోతున్నట్లుగా టాక్ నడిచింది. ఇవే కాకుండా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో కూడా నితిన్ ఓ మూవీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లుగా గత కొద్దిరోజులుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ నితిన్ మ్యాస్ట్రో తర్వాత ఏ సినిమాను పట్టాలెక్కించనున్నాడో చూడాల్సిందే.

Also Read: కరోనా కష్టాల్లో మానవత్వాన్ని చాటుకున్న యంగ్ హీరో.. అలాంటి పిల్లలను దత్తత తీసుకుంటానన్న సందీప్ కిషన్..

కరోనా బాధితులకు అండగా టాలీవుడ్ తారలు.. 300 మంది కోవిడ్ రోగుల దాహాన్ని తీర్చిన అడివి శేష్..