Vaarasudu: వారసుడుతో మరోసారి మా ప్రయత్నం విజయం సాధించింది.. వంశీ పైడిపల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

జనవరి 14న తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఎక్స్ ట్రార్డినరీ కలెక్షన్స్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ని నిర్వహించింది.

Vaarasudu: వారసుడుతో మరోసారి మా ప్రయత్నం విజయం సాధించింది.. వంశీ పైడిపల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Vamsi Paidipally

Updated on: Jan 22, 2023 | 9:09 AM

దళపతి విజయ్ ఇటీవల వారసుడు సినిమాతో మరో సాలిడ్ హిట్ అందుకున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ   ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించారు. వారసుడు సంక్రాంతి కానుకగా విడుదలైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. విజయ్ సరసన రష్మిక మందన్న కథానాయిక నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జనవరి 14న తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఎక్స్ ట్రార్డినరీ కలెక్షన్స్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ని నిర్వహించింది. సక్సెస్ టూర్ లో భాగంగా వైజాగ్ లో పర్యటించిన చిత్ర యూనిట్ అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ఈ  వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. విజయంతో పాటు గౌరవం రావాలనేది మా ప్రయత్నం. ఊపిరి, మహర్షి అలా చేసిన చిత్రాలే. ఇప్పుడు వారసుడుతో మరోసారి మా ప్రయత్నం విజయం సాధించింది. సక్సెస్ తో పాటు గౌరవాన్ని తీసుకొచ్చింది వారసుడు. సినిమా చూసిన ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ ని ఏ రూపంలోనూ అంచనా వేయలేం. ఈ అనుభూతి జీవితంలో మర్చిపోలేం. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు.

దిల్ రాజు గారు డబ్బు కంటే మార్యద కోరుకునే నిర్మాత. సినిమా ఇంత గొప్ప ఉందనే ప్రసంశ వస్తుందంటే.. దీనికి కారణం దిల్ రాజు గారు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాని నిర్మించారు. విజయ్ గారు బిగ్గెస్ట్ స్టార్. ఆయన ఇమేజ్ కి సరిపడేలా ఈ కథని చేయడం ఒక సవాల్. మా టీం ఎంతో హార్డ్ వర్క్ చేసింది. తమన్ మ్యూజిక్ ఈ సినిమా సోల్. ఇంత నమ్మకం మాపై పెట్టిన విజయ్ గారికి కృతజ్ఞతలు. తమిళ్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. అందరూ ప్రేమతో ఈ సినిమా చేశారు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు వంశీ.