ET TOP9News:
1.సెలబ్రిటీల పెళ్లి పెటాకులవ్వడం కామన్ అయిపోయింది. తాజాగా స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల.. ఆయన భార్య రూప విడాకుల కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
2.లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంకు కోవిడ్ పాజిటివ్ రావటంతో చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు మణిరత్నం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు వైధ్యులు.
3. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రామా రావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హిందీలోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని.. త్వరలోనే హిందీ ట్రైలర్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు మేకర్స్.
4. విక్రమ్ సక్సెస్ తరువాత మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా మారారు లోకేష్ కనగరాజ్. త్వరలో విజయ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు లోకేష్. ఈ మూవీతో పాటు సెవెన్ స్క్రీన్స్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రాజ్ కమల్ ఇంటర్నేషనల్, మైత్రీ ప్రొడక్షన్స్ బ్యానర్స్లో సినిమాలకు ఓకే చెప్పారు లోకేష్.
5. బాలీవుడ్ సేవియర్ కార్తిక్ ఆర్యన్ మరో బిగ్ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రజెంట్ షెహజాద వర్క్లో బిజీగా ఉన్న కార్తిక్, నెక్ట్స్ కబీర్ ఖాన్ దర్శకత్వంలో భారీ యాక్షన్ డ్రామాలో నటించేందుకు ఓకే చెప్పారు. ఈ సినిమాను సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు.
6. బ్రహ్మాస్త్ర మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అవ్వటంతో సీక్వెల్ను మరింత గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సెకండ్ పార్ట్లో అలియాతో పాటు దీపికా పడుకోన్ పార్వతిగా కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. బ్రహ్మాస్త్ర తొలి భాగం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
7. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేయబోతున్నారు. ఇటీవల శివ దర్శకత్వంలో ఓ సినిమాను ఎనౌన్స్ చేశారు సూర్య. ఈ సినిమాను తమిళ్తో పాటు తెలుగులోనూ ప్యారలల్గా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.
8.హిందీలో యాక్ట్ చేయడమంటే నా కంఫర్ట్ జోన్ నుంచి కాస్త పక్కకు జరగడమే అని షాకింగ్ కామెంట్లు చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయినా అవసరమనిపిస్తే కచ్చితంగా హిందీ సినిమా చేస్తానని అన్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో ఈ విషయం చెప్పి నెట్టింట వైరల్ అవుతున్నారు.
9.ఇక నయన్ – విఘ్నేష్ తో ఢీల్ క్యాన్సిల్ చేసుకుంది నెట్ఫ్లిక్స్ . పెళ్లికి ముందే తమ మ్యారేజ్ ఫుటేజీని ఎక్స్క్లూజివ్గా నెట్ఫ్లిక్స్కు ఇచ్చేసిన ఈ జంట.. అనుకోకుండా తమ పెళ్లి లోని కొన్ని ఫోటోలు నెట్టింట షేర్ చేసింది. దీంతో అగ్రిమెంట్ రూల్స్ ప్రకారం ఇది విరుద్దం అంటూ.. చేసుకున్న 25 కోట్ల ఢీల్ ను రద్దు చేసుకుంది. తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాలంటూ.. నోటీసు ఇచ్చింది.