Jakkula Nageswara Rao: టాలీవుడ్లో మరో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత మృతి..
సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత రెండు మూడ్రోజుల వ్యవధిలోనే పలువురు సినీ ప్రముఖులు మరణించిన
సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత రెండు మూడ్రోజుల వ్యవధిలోనే పలువురు సినీ ప్రముఖులు మరణించిన సంగతి తెలిసిందే. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్.. సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణించిన వార్తలు మరువక ముందే ఇండస్ట్రీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ప్రముఖ నిర్మాత జక్కుల నాగేశ్వర రావు (46) రోడ్డు ప్రమాదంలో మరణించారు.
జక్కుల నాగేశ్వర రావు లవ్ జర్నీ, అమ్మ నాన్న ఊరెళితే, వీడు సరైనోడు వంటి సూపర్ హిట్ చిత్రాలను తెలుగులో నిర్మించారు. ఈరోజు సాయంత్రం కృష్ణా జిల్లా ఉయ్యురు మండలం మంటాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మాత నాగేశ్వర రావు తీవ్ర గాయాలపాలై అక్కడిక్కడే మరణించినట్లుగా సమాచారం. నాగేశ్వర రావు మరణ వార్తతో టాలీవుడ్ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. నాగేశ్వరరావుకు భార్య , కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Also Read: Highway Movie: ఆనంద్ దేవరకొండ న్యూమూవీ అప్డేట్.. ఆకట్టుకుంటున్న హైవే పోస్టర్స్..
Bigg Boss 5 Telugu: ఫినాలే రేస్లో గాయపడి బెడ్కే పరిమితమైన శ్రీరామచంద్ర.. ప్రియ కామెంట్స్ వైరల్..
Samantha: బాలీవుడ్లో పాగా వేయనున్న సమంత.. మరో మూడు ప్రాజెక్టులకు సామ్ గ్రీన్ సిగ్నల్ ?..